ఐఆర్సీటీసీ భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు –ఎస్సీజెడ్బీజీ27’ని నడుపుతున్నారని.. ఆగస్టు 4 నుంచి 12వ తేదీ వరకు ‘సప్త జ్యోతిర్లింగ దివ్యదర్శన్ యాత్ర’ ప్రారంభం కానుందని తిరుపతి పరిసర జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ సంయుక్తంగా తెలిపారు. అరుణాచలం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచ్చి, త్రివేండ్రం వంటి 7 క్షేత్రాలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం వరకు యాత్ర ఉంటుందన్నారు. యాత్ర సమయంలో ఉదయం టీ, టిఫెన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం (వెజిటేరియన్) అందించనున్నట్లు తెలిపారు. సికింద్రబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు–రేణిగుంట మీదుగా యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతీ భోగీలో రైల్వే తరఫున ఎస్కార్ట్స్, ఆయా క్షేత్రాల్లో భక్తులను దగ్గర ఉండి తీసుకువెళ్లడం, తిరిగి రైలుకు చేర్చడం, సమయానికి ఆహారం, మంచినీరు, టాయ్లెట్ల పరిశుభ్రత, రైలులో సీసీ కెమెరాలు, మైక్ ఏర్పాటు, లగేజీ భద్రత, ప్రయాణ బీమా ఉంటుంది.
60
You Might Also Like
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
18
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
20
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....
అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర
21
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి...
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
18
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
28
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...