భక్తి భావం చాటేలా వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు వినాయక మంటపాల నిర్వాహకులంతా సహకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ వి.రత్న కోరారు. శుక్రవారం హిందూపురంలోని రైల్వేరోడ్డు కేవీఆర్ ఫంక్షన్ హాలులో వినాయక మంటపాల నిర్వాహకులతో పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ రత్న, డీఎస్పీ కంజాక్షన్, ట్రాన్స్కో ఏఈ ఝన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హిందూపురాన్ని శాంతిపురంగా చూద్దామన్నారు. హైదరాబాద్లా గొప్పగా వినాయక చవితి, నిమజ్జనం జరుపుకుందామని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏటా ఎదుర్కొనే సమస్యలు గుర్తించి విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించకుండా చూడాలన్నారు. అలాగే చెవులు చిల్లులు పడేలా డీజేలు, సౌండ్స్ వద్దన్నారు. నిర్దేశించిన మార్గంలోనే గణేష్ శోభయాత్ర సాగాలన్నారు. శోభయాత్ర సమయంలోనూ కరెంట్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం నిర్వహకులు, పట్టణ ప్రముఖులు తమ సందేహాలు, సూచనలు అధికారులకు వివరించారు.
65
You Might Also Like
‘పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
2
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ...
శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం
21
శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి,...
భారత విప్లవ వీరకిశోరం భగత్ సింగ్
(సెప్టెంబర్ 27- భగత్ సింగ్ జయంతి) అమరవీరులలో ప్రముఖులుగా పేరొందిన షహీద్ భగత్సింగ్. కిషన్సింగ్, విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27వ తేదీన నేటి పాకిస్తాన్లోని ఫైసలాబాద్...
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాంతి హోమం
28
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు...
తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!
-డాక్టర్ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి...
ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్పి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి...