అనంతపురం జిల్లాలోని చారిత్రక గుత్తికోట ఇప్పటికీ పటిష్టంగా ఉంది. ఎంతో మంది రాజులతోపాటు బ్రిటిష్వారు సైతం ఈ కోట నుంచి పాలన కొనసాగించారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. కట్టడాలు, కోనేరు, ప్రాకారాలు, బురుజులు, రక్షణ కోసం నిర్మించిన పొడవాటి గోడ, గుర్రపు, గజశాలలకు వేటికవే ప్రత్యేకం. నిర్వహణపై అలసత్వం కారణంగా రక్షణ గోడలు శిదిలమవుతున్నాయి. ప్రాకారాలు, బురుజులు నేడు కళావిహీనంగా మారిపోయాయి. పర్యాటకులు సైతం అంతంతమాత్రంగానే వస్తున్నారు. కోటపై భాగానికి చేరుకోవాలంటే 3 గంటల సమయం పడుతోంది. ఆసక్తితో పర్యాటకులు ఎక్కే ప్రయత్నం చేసినా వెళ్లే దారిలో మౌలిక వసతులు లేక నిట్టూర్చుతున్నారు. గతంలో రోప్వే వేసే ప్రణాళికలు వేసినా అవి కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో చారిత్రక, ప్రాచీన ప్రాశస్త్యం ఉన్న కట్టడాలను, ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే దిశగా కలెక్టర్ వినోద్ కుమార్ సంబందిత శాఖలకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. టూరిస్ట్ హబ్ మార్చే దిశగా వేసే అడుగుల్లో భాగంగా గుత్తికోటను అభివృద్ధి చేస్తే.. పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.
43
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
34
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
32
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
48
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
26
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
22
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
39
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...