కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు టీటీడీ సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. బంగారు తాపడం చేయించడానికి 1991లోనే కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త బి.వెంకటరమణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పటికి ఆలయ పునర్నిర్మాణం కాకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. 2012లో ఆలయ పునర్నిర్మాణం సమయంలో, 2019లో మరోసారి ప్రణాళిక చేసినా ముందడుగు పడలేదు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో గత ఏడాది మరోసారి ప్రణాళిక రూపొందించారు. డిసెంబరులో ఈవో రామచంద్రమోహన్, ఛైర్మన్ రోహిత్, ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేవాదాయశాఖ స్థపతి, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల బృందం పరిశీలించి ప్రాథమిక అంచనా సిద్ధం చేశారు. సుమారు 12.5 కేజీల బంగారం అవసరం కానుందని, రూ.7 కోట్లు వ్యయమయ్యే అవకాశముందని అంచనా వేశారు. ప్రత్యేక ఖాతా ద్వారా దాతల నుంచి విరాళాలు స్వీకరించి పనులు చేపట్టాలని నిర్ణయించారు. టీటీడీ అధికారుల బృందం అంచనాలు తయారు చేయాలని దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో వారు శుక్రవారం గోపురాన్ని పరిశీలించి ఎంత స్వర్ణం అవసరం? ఇందుకయ్యే వ్యయం.. పనులు ఏవిధంగా చేపట్టాలో దేవస్థానానికి నివేదిక అందిస్తారు.
46
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
49
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
30
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
37
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
31
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
49
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...