తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమిళనాడు, పుదుచ్చేరి సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ పూజ్య మోహన్ భాగవత్తో సోమవారం భేటీ అయ్యారు. చెన్నై వచ్చిన మోహన్ భాగవత్ను కలుసుకుని స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం తమిళనాట టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా శేఖర్ వివరించారు. 2016లో తాను టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్నప్పుడు దేశంలోనే ప్రప్రథమంగా అలిపిరిలో ‘గోమందిరం’ నిర్మించినట్టు వివరించారు. ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ గోమందిరంలో వేలాదిమంది భక్తులు గోపూజ సేవ, గోప్రదక్షిణం, గో తులాభారం వంటి కార్యక్రమాలను నిర్వహించిన తరువాతే శ్రీవారిని దర్శించుకుంటున్నారని వివరించారు. ఈ గోమందిరంలో సదుపాయాల కోసం రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. గోమందిర ప్రాంగణంలో ప్రతిరోజూ ‘శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం’ జరుగుతోందని, వందలాదిమంది భక్తులు ఈ హోమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ హోమం కోసం తన సొంత ఖర్చుతో మండపం నిర్మించనున్నామని, భూమి పూజ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయన్నారు. అదేవిధంగా చెన్నైలో నిర్మితమైన పద్మావతి అమ్మవారి ఆలయం, కన్నియాకుమారి, వేలూరు, ఉళుందూర్పేటలోని ఆలయాల నిర్మాణంలో తన సహకారం గురించి కూడా వివరించారు. అంతేగాక తమిళనాడు నుంచి తిరుమలకు వెళ్లే పాదయాత్రికుల కోసం విశ్రాంతి కేంద్రాలను నిర్మించాలనే తన కలల ప్రాజెక్టును నెరవేర్చాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పురటాసి మాసంలో తమిళనాడు నుంచి వేలాదిమంది భక్తులు చెన్నై నుంచి తిరుపతికి, ఇతర జిల్లాల నుంచి చిత్తూరు మీదుగా తిరుమలకు పాదయాత్రగా వెళ్లేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నందున, ఈ మార్గాల్లో ప్రతి 25 కి.మీటర్లకు ఒకటి చొప్పున విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిఉందన్నారు. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి ఒక్కో ఎకరా చొప్పున భూమిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఆసక్తిగా ఆలకించిన మోహన్ భగవత్.. శేఖర్ను అభినందించారు.
59
You Might Also Like
13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
47
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి...
పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
27
పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు...
సర్జికల్ స్ట్రైక్: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016,...
తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…
67
శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది....
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
37
రాజస్థాన్లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత...
సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..
29
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా బంగారు...