News

కోదండరామాలయ గిరి ప్రదక్షిణ

48views

ఆంధ్ర అయోధ్యగా పేరు గాంచిన ఒంటిమిట్టలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామస్వామి భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. సీఐ పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు పాటూరు గంగి రెడ్డితో కలిసి ఉదయం ఆరు గంటలకు కోదండ రామాలయం నుంచి పెద్ద కొత్త పల్లె, పేరూరు, పెన్నపేరూరు, ఇబ్రహీంపేట, రాచగూడపల్లె, రాచపల్లి, సాలాబాద్‌, మలకాటిపల్లె మీదుగా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా సీఐ పురుషోత్తంరాజు మాట్లాడుతూ కోదండ రాముని ప్రాబల్యం మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియాలని ప్రతి పౌర్ణమికి 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్వామివారి ఆశీస్సులతో తాను ముందుకు వెళుతున్నానని, అడ్డ సంకల్పంతో స్వామివారికి సేవ చేయాలని వినూత్న కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు, శివరాజు, ప్రతాప్‌రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, బలరాం, పలువురు భక్తులు పాల్గొన్నారు.