పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో దేవరగట్టు సంబరానికి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను పదో తరగతికి సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలు, తెలియజేయడంలో భాగంగా పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి ఆలయంలో ఆలయంలో జరిగే బన్నీ ఉత్సవాన్సి ప్రస్తావించారు. ప్రతిఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర, కర్రల ఊరేగింపు (సమరం) కొనసాగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ వేడుకకు సంబంధించిన చరిత్రను తాజాగా పదోతరగతి తెలుగు వాచకంలో పొందు పరిచారు. భక్తులు, కర్రలు ఎందుకు తీసుకువస్తారు…? పండుగ ప్రత్యేకత, గుడి వద్ద పూజారులు వినిపించే భవిష్యవాణి, వసంతోత్సవం రోజున దేవరగట్టులో గోరవయ్యలు ఇనుప గొలుసు తెంపడం వంటి అంశాలను పా ఠ్యాంశంలో చేర్చారు. ప్రాచీన సం ప్రదాయ పండుగ దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి దేవరగట్టు ఆలయ చరిత్ర, బన్నీ జైత్ర యాత్రపై తెలుగు కొత్త పాఠ్య పుస్తకంలో ప్రభుత్వం ప్రచురిం చడం అభినందనీయమని తెలుగు కవయిత్రి, ఉపాధ్యాయురాలు బత్తిన మహాదేవి అన్నారు.
82
You Might Also Like
తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ
2
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్హౌస్...
కర్కశంగా.. కుక్కేసి! గోవుల ఘోష
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్లో సిద్ధంగా ఉన్న...
ఆదిగురువు వ్యాసుడు
యోగ సంప్రదాయంలో పరమశివుడే ఆదిగురువు. ఆయన తాండవం చేసే సమయంలో చేతిలో ఉన్న డమరుకం నుంచి నాదం, ఆ నాదం నుంచి వేదం ఆవిర్భవించాయి. ఈ వేదాన్ని...
365 రోజులు 450పైగా ఉత్సవాలు – ప్రతీరోజు పండగే
( తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకం ) ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి...
ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం
కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని...
అరుణాచల్ సరిహద్దుల్లో ఓ శిఖరానికి పేరు పెట్టిన భారత్
23
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ...