86
ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. కేస్ట్రల్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ శుక్రవారం ఉదయం సిస్రీ నుంచి కేదార్నాథ్కు పైలట్, ఆరుగురు భక్తులతో బయలుదేరింది. అనంతరం ఏడు గంటల సమయంలో హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలిప్యాడ్కు కొన్ని మీటర్ల దూరంలో దాన్ని సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గాహర్వర్ తెలిపారు.