News

సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో మహాభోగ్‌ కార్యక్రమం

110views

దేశంలోని 15 కోట్ల బంజారాలు తమదైన సంసృతి, సంప్రదాయాలను విస్మరించకుండా కాపాడుకోవాలని బంజారా సేవా కల్చర్‌ ఆర్గనైజర్‌ ఎస్‌కే రామచంద్ర నాయక్‌ పిలుపునిచ్చారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవాగఢ్‌లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో మహాభోగ్‌ కార్యక్రమం నిర్వహించారు. అర్చకుడు మారుతీప్రసాద్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సేవా కల్చర్‌ ఆర్గనైజర్‌ రామచంద్ర నాయక్‌, సభ్యులు సుబ్రహ్మణ్యం నాయక్‌, రూపానాయక్‌ మాట్లాడుతూ… దేశంలోని బంజారాలు ఏకతాటిపైకి వచ్చి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో నడవాలన్నారు. క్రాంతికారి సేవాలాల్‌ మహారాజ్‌ ధర్మ బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆదర్శవంతమైన కట్టుబాట్లు, వివాహ శుభకార్యాలు, ఇతర వేడుకలను బంజారా సంప్రదాయ రీతిలో మాత్రమే జరుపుకోవాలని సూచించారు.