విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని వెల్లడిం చారు. దర్శనం అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్న ప్రసాదం పంపిణీపై పదే పదే మైక్ అనౌన్స్ చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఏ విధమైన కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ సిబ్బందికి సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
323views
You Might Also Like
కేదారనాథ్ థామం… అతిపెద్ద పరిశుభ్రతా కార్యక్రమం
46
కేదార్నాథ్ ధామ్ హిమాలయాల ఒడిలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే, ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీ వల్ల ఇక్కడ పర్యావరణ సమస్యలు, ముఖ్యంగా ప్లాస్టిక్...
భారత్ది సాంకేతిక ఐటీ.. పాక్ది ఉగ్రవాద ఐటీ
48
ఉగ్రవాదం అనేది వికృత, వక్ర మనస్తత్వం నుంచి ఉద్భవిస్తుందని భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటాన్ని జాతీయ భద్రతా సమస్య మాత్రమే కాదని,...
వెలుగులోకి ‘ల్యాండ్ జిహాద్’ అక్రమాలు
47
ఉత్తర ప్రదేశ్లోని డియోరియా జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పేరిట జరుగుతున్న అక్రమాలపై యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న...
అన్నవరం రత్నగిరిపై వేద పండిత సదస్యం
52
అన్నవరం రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో వేద పండిత సదస్యం ఘనంగా...
మల్హర్ చారిత్రక వైభవం : సనాతన ధర్మ వారసత్వానికి సజీవ సాక్ష్యాలు
37
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న మల్హర్ గ్రామం మరోసారి తన చారిత్రక వైభవాన్ని చాటుకుంది. తాజాగా ఇక్కడ లభించిన 1500 ఏళ్ల నాటి రాగి శాసనం (తామ్రపత్రం)...
పరాయి “డే” సంస్కృతి మోజులో మన అస్తిత్వాన్ని కోల్పోతున్నామా?
ఆధునికత వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, మన జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘డే’ (Day) సంస్కృతి మన యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది....





