
254views
తమిళనాడు రాష్ట్రం మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్లో కజకిస్థాన్ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. కజకిస్థాన్కు చెందిన డిమిత్రి, ఎలోనా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. క్రైస్తవ మతానికి చెందిన వీరు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ మతం, తమిళ సంస్కృతి, సంప్రదాయాలపై ఇష్టం పెంచుకున్న వీరు హిందూ మతంలోకి మారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇటీవల తమిళనాడుకు వచ్చి హిందూ మతం స్వీకరించారు. తరువాత తమిళనాడులోని పలు ప్రసిద్ధ ఆలయాలను సందర్శించారు. శుక్రవారం మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా తిర్కుడైయూర్కు చేరుకున్నారు. అక్కడ ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయం మేరకు శనివారం వేకువ జామున వివాహం చేసుకున్నారు. అనంతరం తిరుక్కడైయూర్లోని అభిరామి సమేత అమృతగడేశ్వరుడిని దర్శించుకున్నారు.





