News

తాజ్‌మహల్ షాజహాన్ నిర్మించలేదు..హైకోర్టులో పిటిషన్

338views

తాజ్‌మహల్‌‌ని షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజా మాన్ సింగ్ ప్యాలెస్ మార్పులు చేసి తాజ్ మహల్‌గా మర్చారంటూ పిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ కోర్టు ఈ విషయంపై భారత పురావస్తు శాఖ దృష్టిసారించాలని ఆదేశించింది. కాగా, తాజ్ మహల్‌కు చెందిన చరిత్ర పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దాలంటూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం పరిష్కరించింది.

పిటిషనర్ గతంలో ఇదే విధమైన ప్రార్థనలతో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారని, అతను ASIకి ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రతిపాదించిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడానికి అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ తుషార్ గెడెలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హిందూ సేన ఇదే తరహా పిటిషన్‌తో గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనాన్ని ప్రస్తావించింది. కానీ, ఈ విషయంలో ఏఎస్ఐ ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై దృష్టిసారించాలని తాజాగా ఏఎస్ఐని కోరింది. కాగా, తాజ్‌మహల్ వయసు ఎంతో కూడా నిర్ధారించేందుకు ఏఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని హిందూ సేన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.