News

గోల్కొండ సింహం బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

754views

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో బాల్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్‌ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాల్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు కార్వాన్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.

Source : Bharath Today

http://www.bhaarattoday.com/posts/view/bjp-senior-leader-badham-balreddy-death/359