
-
అనుమతించిన పాక్ సర్కార్
-
మండిపడ్డ సిక్కులు
ఇస్లామాబాద్: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద పాకిస్థాన్ మోడల్ ఫోటోషూట్తో పాటు తలపై వస్త్రం ధరించకపోవడం తీవ్ర దుమారం రేగుతోంది. తలపై వస్త్రం ధరించనందుకు ఆమెపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్కు చెందిన వస్త్ర సంస్థ మన్నత్ కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్ని షూట్ చేసింది. ఇందులో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని, ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలయ్యింది.
సిక్కులు ఈ ప్రకటనపై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ మండిపడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను శిరోమణి అకాళీ దల్ అధికార ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా కోరారు.





