కోహినూర్ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్ చేశారు. లండన్ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలనే అంశం కూడా ముఖ్యమైనదే. మాకు ఈ విగ్రహం కోహినూర్ కంటే విలువైనది. ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన అంశం. కేంద్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తే లండన్ నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకురావొచ్చు. 2024లో భోజ్శాల ప్రాంగణంలో పురావస్తు శాఖకు లభించిన 94 విగ్రహాలనూ ఈ ప్రాంతంలో తిరిగి ప్రతిష్ఠించాలి’’ అని పిటిషనర్లు కోరారు.
62views
You Might Also Like
ద్వారకా తిరుమలలో ఘనంగా యోగాంధ్ర–2026 కార్యక్రమం
27
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని అనివీటి క్రొత్త కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగాంధ్ర-2026 కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్య చైతన్యాల సమ్మేళనంగా విజయవంతంగా...
ధర్మస్థళ కేసులో సంచలనం.. ప్రకాష్ రాజ్ పేరు చెప్పిన చిన్నయ్య!
35
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో...
స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న పీఓకే ప్రజలు..
26
పాకిస్తాన్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో తమ హక్కుల కోసం నినదిస్తున్న స్థానిక ప్రజలను పాక్ ఆర్మీ ఊచకోత కోస్తోంది. పీఓకే...
ఉగ్రవాదుల కొత్త పన్నాగాలు గుహలు.. ఇప్పుడు బంకర్లు:.
37
భద్రతా బలగాలకు చిక్కకుండా ఉగ్రవాదులు కొత్తకొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఉగ్రదాడులకు ముందు వారు దాక్కొనేందుకు గుహలకు బదులుగా బంకర్లను వాడుతున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్లో భాగంగా...
మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితుల అరెస్ట్
48
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్...
సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోంది : అతుల్ లిమాయే
40
సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. సనాతన సంప్రదాయంలో కుటుంబం, విద్య, సేవా కార్యక్రమాలు,...





