కోహినూర్ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్ చేశారు. లండన్ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలనే అంశం కూడా ముఖ్యమైనదే. మాకు ఈ విగ్రహం కోహినూర్ కంటే విలువైనది. ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన అంశం. కేంద్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తే లండన్ నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకురావొచ్చు. 2024లో భోజ్శాల ప్రాంగణంలో పురావస్తు శాఖకు లభించిన 94 విగ్రహాలనూ ఈ ప్రాంతంలో తిరిగి ప్రతిష్ఠించాలి’’ అని పిటిషనర్లు కోరారు.
38views
You Might Also Like
అయోధ్య రామాలయ దుర్గ దేవాలయ ధ్వజారోహణం ఈ నెల 29 న
28
అయోధ్య రామ మందిర ఆవరణలో వున్న దుర్గా దేవాలయం ధ్వజారోహణ కార్యక్రమం ఈ నెల 29 న జరగనుంది. ప్రముఖ సాధ్వీ సాధ్వీ రితింభర ఆలయం వద్ద...
రోడ్లపై నమాజ్ అంటే అదో రకమైన ఉగ్రవాదమే : సురేంద్ర జైన్
24
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లపై నమాజ్ చేయడాన్ని నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడం అనేది...
దేవాదాయ చట్టాల చెల్లుబాటుపై విచారిస్తాం
32
హిందూ దేవాలయాలు, మతపరమైన దేవాదాయ సంస్థల నియంత్రణ చట్టాల రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు తీసుకొచ్చిన దేవాదాయ...
పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్లోనే స్కెచ్ : ఎన్ఐఏ
26
జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడికి సంబంధించి.. వ్యూహా రచన,...
విత్తన బంతులు తయారీ శిక్షణ కార్యక్రమం
30
ఏలూరు జిల్లా పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ రైతు పొలంలో విత్తన బంతులు తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు...
సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు.. బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా : షేక్ హసీనా
14
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న...





