కోహినూర్ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్శాల- కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్ చేశారు. లండన్ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలనే అంశం కూడా ముఖ్యమైనదే. మాకు ఈ విగ్రహం కోహినూర్ కంటే విలువైనది. ఇది మత విశ్వాసం, సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన అంశం. కేంద్రం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తే లండన్ నుంచి విగ్రహాన్ని తిరిగి తీసుకురావొచ్చు. 2024లో భోజ్శాల ప్రాంగణంలో పురావస్తు శాఖకు లభించిన 94 విగ్రహాలనూ ఈ ప్రాంతంలో తిరిగి ప్రతిష్ఠించాలి’’ అని పిటిషనర్లు కోరారు.
84views
You Might Also Like
స్కూల్ లో ఉర్దూ పాటలు, కల్మా బోధన…
32
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు...
హిందువులు మరింత బలోపేతం కావాలి : మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్
33
హిందూ సమాజం మరింత బలోపేతం కావాలంటే హిందువులు ఆధ్యాత్మిక శక్తితో పాటు సంపద, అధికారం కూడా ఆర్జించాలని మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్ పిలుపునిచ్చారు. కేరళంలోని...
ఆర్మీ కొత్త చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..
30
భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను...
పీఓకేలో పాకిస్థాన్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్తో కలుస్తామని హెచ్చరిక
38
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు...
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం
34
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ...
38 ఏళ్ల తర్వాత ఆలయానికి తిరిగి చేరిన దివ్యమూర్తి
42
జమ్మూ కాశ్మీర్.. భారత్ కే మకుటాయమానం. అడుగడుగునా గుడి వుంది. ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్ లోని కుప్వారాజిల్లా,...





