
పశ్చిమ బెంగాల్లోని విద్యార్థి రాజకీయాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్షాల ఏకపక్ష ఆధిపత్యానికి తెరదించుతూ, వారి కరడుగట్టిన కోటగా భావించే ప్రసిద్ధ జాదవ్పూర్ విశ్వవిద్యాలయం (JU) లో చారిత్రాత్మక మార్పు ఆవిష్కృతమైంది. యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్యాంపస్ ప్రాంగణంలో అధికారికంగా తన ‘శాఖ’ను నిర్వహించి భగవాధ్వజాన్ని ఎగురవేసింది. ఒకప్పుడు దేశ వ్యతిరేక నినాదాలకు, కమ్యూనిస్ట్ భావజాల దౌర్జన్యాలకు కేంద్రంగా మారిన ఈ క్యాంపస్లో, రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఘన విజయాల స్పూర్తితో విద్యార్థులు భారీ ఎత్తున ‘విజయ పథ సంచలనాన్ని’ నిర్వహించారు.
విద్యాసంస్థల వేదికగా లెఫ్ట్ సంఘాలు ప్రదర్శించే అరాచక సంస్కృతి, డ్రగ్స్ వ్యవహారాలు, విద్యాపరమైన వైఫల్యాలపై సాధారణ విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే క్యాంపస్లో క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించే ఆర్ఎస్ఎస్ జాతీయవాద భావజాలం వైపు విద్యార్థులు స్వచ్ఛందంగా ఆకర్షితులవుతున్నారు. దశాబ్దాలుగా బెంగాల్ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్న వామపక్షాల సైద్ధాంతిక పతనం ఈ ఘటనతో స్పష్టమైంది. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఈ మార్పు బెంగాల్ భవిష్యత్తు రాజకీయాల్లో జాతీయవాద శక్తుల విజయకేతనానికి ఒక బలమైన పునాదిగా మారుతోంది.





