News

రామయ్య గోపురాలకేదీ నవమి శోభ

138views

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి  ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సివిల్, విద్యుత్తు విభాగం పర్యవేక్షణలో వసతుల కల్పనకు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే.. రామయ్య క్షేత్రంలో తూర్పు, ఉత్తర, దక్షిణ గోపురాలు కళ తప్పాయి. రంగ మండపం, శ్రీవారి పోటు, యాగశాల పైకప్పు దెబ్బతిన్నాయి. మరమ్మతు పనులు చేయడానికి తితిదే నుంచి కేంద్ర పురావస్తు శాఖకు అవసరమైన నిధులను ముందస్తుగా ఇచ్చారు.

  • బ్రహ్మోత్సవాలకు నవమి శోభ తీసుకు రావాలని పురావస్తు శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 2న రూ.96,85,484 గుత్తపత్రాలు ఆహ్వానించగా చెన్నైకి చెందిన ఓ గుత్తేదారు దక్కించుకున్నారు. పనులను చేపడితే ఉత్సవాల నాటికి పూర్తి చేయలేరేమోనని ఇంకా మొదలుపెట్టలేదు.
  • రంగమండపం, శ్రీవారిపోటు, యాగశాల పైకప్పు పైన ప్రస్తుతం పూత వేయకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. గోపురాల శిల్పాలు నల్లగా ఉన్నాయి. పాచి పట్టి దర్శనమిస్తున్నాయి. యాత్రికులను ఆకర్షించేలా గోపురాలకు కొంగొత్త కళ తీసుకురావాలని తితిదే అధికారులు భావించినా ఎలాంటి కదలిక లేదు.
  • రంగ మండపం 32 స్తంభాలతో శిల్ప సంపద కడు రమణీయంగా ఉంది. వారసత్వ సంపద భావితరాలకు అందించడానికి కనీసం రసాయనాలతో కడిగి శుభ్రం చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.