
తమిళనాడు నమక్కల్ జిల్లా తిరుచెంగోడ్ పట్టణంలో ఒక ఘటన వెలుగుచూసింది. తవ్వకాలు జరపుతుండగా.. మూడు అడుగుల ఎత్తైన మట్టి అమ్మన్ విగ్రహం బయటపడింది. పెరియ ఒంగలియమ్మన్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కార్మికులు భూమిని తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడింది. దశాబ్దాల నాటి ఈ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నదని ఆలయ నిర్వాహకులలో ఒకరైన వి. బాలుసామి తెలిపారు. 1960లో చివరిగా ఈ ఆలయ పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. విగ్రహం దెబ్బతిన్న తర్వాత గర్భగుడి కింద ఖననం చేసి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయ నిర్వాహకులు ఈ విషయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు తెలియజేశారు. స్థానికులు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మన్… దక్షిణ భారతదేశంలో ప్రధానంగా పూజించే దేవతా రూపం. శక్తికి ప్రతీకగా చెబుతుంటారు. ముఖ్యంగా ఆమె ప్రకృతి, క్షేమానికి సంబంధించిన దేవతగా భావిస్తారు. తమిళనాడులో అమ్మన్ను అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరిగా కొలుస్తారు.





