
హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 50 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి చెప్పారు. అశోక వనానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని ఈ దాడిలో తాము అనుసరించినట్లు రాజ్నాథ్ చెప్పారు.
తమ అమాయక ప్రజలను చంపిన వారిని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రి పేర్కొన్నారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్ కు ఉందని రాజ్నాథ్ చెప్పారు. ఈసారి కూడా, మునుపటిలాగే తగిన సమాధానం భారత్ ఇచ్చినట్లు వివరించారు. మన సైనికులు రాత్రి అద్భుత పరాక్రమం ప్రదర్శించారని చెబుతూ మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారని కొనియాడారు.
సాధారణ పౌరులకు ఎలాంటి సిబ్బంది లేకుండా దాడులు చేశారని, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్తిసన్కు గట్టి సమాధానం ఇచ్చామని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి సత్తాచాటారని ప్రశంసించారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేతమైన దాడి చేశారని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాడులు చేశామని పేర్కొన్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అభినందనలు తెలిపారు.
సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని పేర్కొంటూ సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్నాథ్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు. పహల్గాంలో అమాయకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని ఆరోపించారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. శత్రువకు సరైన బుద్ధి చెబుతామని, దేశభద్రకు భంగం కలిగించే చర్యలను సహించమని రక్షణ మంత్రి హెచ్చరించారు. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశామని స్పష్టం చేశారు. భారత్ లక్ష్యం పాకిస్తాన్ కాదని.. ఉగ్రవాదులేనని తేల్చి చెప్పారు.
“నిర్ణయించిన లక్ష్యాలను సరైన సమయంలో ఖచ్చితంగా ధ్వంసం చేశాం. పౌర జనాభా ఏమాత్రం ప్రభావితం కాకుండా చూసుకోవడంలో మన సాయుధ దళాలు సున్నితత్వాన్ని చూపించాయి. ఒక విధంగా, భారతీయ జవాన్లు ఖచ్చితత్వం, అప్రమత్తత, మానవత్వాన్ని చూపించారని మనం చెప్పగలం. మొత్తం దేశం తరపున జవాన్లు, అధికారులను నేను అభినందిస్తున్నా. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీని కూడా నేను అభినందిస్తున్నా” అని రక్షణ మంత్రి తెలిపారు.
సరిహద్దుల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. భారత్లో అనేక దేశాల సంస్కృతులు కనిపిస్తాయని, భారత సంస్కృతి కూడా అనేక దేశాల్లో విస్తరించి ఉన్నదని చెప్పారు. వేల సంవత్సరాలుగా అనేక దేశాలతో మైత్రీభావంతో ఉన్నామని, భారత్కు వివిధ మార్గాల్లో అరబ్బులు, యూరోపియన్లు వచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెంచేందుకు కట్టుబడి ఉన్నామని మరోసారి మంత్రి స్పష్టం చేశారు.