
పహల్గాం ఉగ్రదాడి ఘటనతో తీవ్రంగా కలత చెంది ఓ వ్యక్తి తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కి చెందిన మహ్మద్ ఖాన్ పహల్గాం ఉగ్రదాడితో తీవ్రంగా కలత చెంది, తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అంతేకాకుండా తన స్నేహితురాలు సృష్టి హల్దార్ ను హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం కూడా చేసుకున్నారు. హిందూ మతం లోకి వచ్చిన తర్వాత మహ్మద్ ఖాన్ గా వున్న తన పేరును కాస్తా ‘‘సంజు’’ గా మార్చేసుకున్నాడు.
సంజు జబల్పూర్లోని రాంఝి ప్రాంతంలో కుట్టుమిషన్ రిపేరర్గా పనిచేస్తున్నాడు. సృష్టి టైపింగ్ నేర్చుకోవడానికి దగ్గర్లోని ప్రాంతానికి వచ్చేది. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. వారు మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.మొదట ఇరు వైపులా కుటుంబీకులు, సమాజం వారి వివాహాన్ని సమర్థించలేదు. దీంతో వారు SDM ముందు హాజరై, కోర్టులో వివాహం చేసుకున్నారు. దీని తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం రామ మందిరంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి హిందూ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
అయితే.. మొదట్లో సృష్టి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ సంజు.. పహల్గామ్ ఘటన తననెంతో కదిలించిందని, పూర్తిగా ఆలోచించిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించాలని నిర్ణయించానని చెప్పడంతో ఈ వివాహాన్ని అంగీకరించారు.