17
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో జె.శ్యామలరావు తెలిపారు. అంతర్గత రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్వెస్ట్ కార్నర్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు లగేజీ లేకుండా క్యూలైన్లో ప్రవేశించాలని సూచించారు.