News

లడ్డూ వివాదం.. 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతియాగం

68views

తిరుమల: శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం కొనసాగుతోన్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా ఆగమశాస్త్రపరంగా సూచనలివ్వాలని అధికారులు కోరారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. వేణుగోపాల దీక్షితులు, నలుగురు ఆగమ సలహాదారులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.