ArticlesNews

హిందూ అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేసి నడిబజారులో నగ్నంగా వేలాడదీసారు

52views

డైరెక్ట్ యాక్షన్ డే: బెంగాల్‌ చరిత్రలో చీకటి రోజు

1946, ఆగస్టు 16. బెంగాలీ ముస్లిములు ఆ రోజును తమ ప్రణాళికను అమలు చేయడానికి ఎంచుకున్నారు. ‘పవిత్ర యుద్ధం – జిహాద్’ ప్రకటించడానికి ఆరోజే పవిత్రమైన రోజని వారు భావించారు. లక్షలాది ముస్లిములు కలకత్తాలోని పెద్ద మైదానంలో గుమిగూడారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటి అని తెలియని వారికోసం ముస్లింలీగ్ సంస్థ కరపత్రాలు పంచిపెట్టింది. ‘అల్లా కోరిక మేరకు జిహాద్ చేపడుతున్నాం’ అని ప్రకటించింది.

ఆ కరపత్రంలో ఆ రోజే జిహాద్ ఎందుకు మొదలుపెట్టాలో వివరించారు. 1365లో ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం రంజాన్ నెల 17వ రోజు మహమ్మద్ ప్రవక్త తన 313మంది అనుచరులతో కలిసి బదర్ వద్ద యుద్ధం చేసాడు. దాన్ని బదర్ యుద్ధం అంటారు. అవిశ్వాసుల మీద చేసిన ఆ యుద్ధంలో మహమ్మద్ గెలిచాడు. అదే ప్రపంచంలో మొట్టమొదటి ‘జిహాద్’. ఆ నెలలోనే పదివేల మంది ముస్లిములు మక్కాపై దండయాత్ర చేసి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇస్లాం ఆధిపత్యం, పరిపాలన ఆవిధంగా మొదలైంది.

ముస్లింలీగ్ లక్ష్యం ఏమిటో ఆ కరపత్రంలో స్పష్టంగానే చెప్పారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొట్టడం, తమ పరిపాలనను స్థాపించడమే వారి లక్ష్యం. ‘‘భారతదేశంలో 10కోట్ల మంది ముస్లిములు ఉన్నా, వారు బ్రిటిష్ వారికి, హిందువులకూ బానిసలుగా ఉండిపోయారు. ఈ దేశంలో మళ్ళీ ఇస్లామిక్ రాజ్యం రావాలి. దానికోసం ముస్లిములు జిహాద్ చేయాలి, తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయాలి’’ అని ఆ కరపత్రంలో రాసారు.

భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశంగా ఏర్పాటుచేస్తామని ముస్లింలీగ్ స్పష్టంగా పేర్కొంది. కాఫిర్లను శిక్షించడానికి, వారి ఊచకోత కోసి చంపేయడం ద్వారా వారిపై విజయం సాధించాలి… అని ముస్లింలీగ్ తన కరపత్రంలో రాసుకొచ్చింది.

‘డైరెక్ట్ యాక్షన్ డే’ అని పిలిచిన ఆ రోజు బెంగాల్ ప్రాంత హిందువుల జీవితాల్లో చీకటిరోజు. సుహ్రావర్దీ ఆ రోజు సమ్మెకు పిలుపినిచ్చారు. ముస్లిములందరూ తమ దుకాణాలు మూసివేసారు. మధ్యాహ్నం 2గంటలకు సమావేశం ప్రారంభమైంది. కలకత్తా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచీ ముస్లిములు ఊరేగింపులు చేస్తూ మైదానం దగ్గర చేరుకున్నారు. మధ్యాహ్నం నమాజ్ తర్వాత వారు కత్తులు, ఇతర ఆయుధాలు తీసుకుని హిందువులపై దాడి చేసి వారిని ఊచకోత కోసారు.

ఇస్లామిస్టుల మూక ఒకటి విక్టోరియా కళాశాలపై దాడి చేసింది. ఇనపచువ్వలు, లాఠీలతో ముస్లిం మూకలు చెలరేగిపోయారు. కళాశాలలో ఉన్న విద్యార్ధినులు అందరిపైనా తరగతి గదుల్లోనే అత్యాచారం చేసారు. తర్వాత ఆ అమ్మాయిలను చంపేసి, కళాశాల తరగతి గదుల కిటికీలకు నగ్నంగా వేలాడదీసారు. కొందరు అమ్మాయిల దేహాలను రజాబజార్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ మాంసం దుకాణాల్లో మాంసం వేలాడదీసే హుక్కులకు ఆ ఆడపిల్లల నగ్నదేహాలను వేలాడదీసారు.

మధ్యాహ్నం నమాజ్ పూర్తయాక సుమారు లక్ష మంది ముస్లిములు ఆ మూకదాడులకు పాల్పడ్డారు. ‘‘లేకర్ రహేంగే పాకిస్తాన్’’, ‘‘నారా ఎ తక్బీర్ – అల్లాహో అక్బర్’’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఘాతుకాలను కొనసాగించారు.

కలకత్తా వీధుల్లో పడివున్న హిందువుల శవాలను రాబందులు పీక్కు తిన్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ‘డైరెక్ట్ యాక్షన్ డే’ పేరిట బెంగాలీ ముస్లిములు తమ తోటి హిందువులపై పాల్పడిన ఘాతుకాల చరిత్రను తెలుసుకోవడం అవసరం.