ప్రజా సంక్షేమం, గోమాత సంరక్షణ, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ రాజస్థాన్ లిక్మడేశ్వర్ యశ్నాజీ మహరాజ్ మట్ నుంచి సోమనాథ్జీ మహరాజ్, కన్నత్జీ మహరాజ్ అనే సాధువులు ప్రారంభించిన చార్ధామ్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలోని నగరికి చేరుకుంది. మున్సిపల్ పరిధిలోని కీళపట్టు చంద్రమౌళీశ్వర ఆలయంలో వారు బసచేశారు. ఆలయ నిర్వాహకులు వారికి బస ఏర్పాట్లుచేశారు. శనివారం ఉదయం చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం చార్ధమ్ అని పిలవబడే నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరంను, 12 జ్యోతిర్లింగాలను, సప్త నదులను, సప్తపురిని, పంచసరోవరాలను పాదయాత్రగా వెళ్లి దర్శించుకునేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన యాత్ర ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు రెండు ధామ్లు, నాలుగు జ్యోతిర్లింగాలు, నాలుగు పురులు దర్శించుకోవడం జరిగిందన్నారు. 4 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిందన్నారు. 104వ రోజున నగరికి చేరుకున్నామని చెప్పారు. ప్రస్తుతం నగరి నుంచి 5వ పురి అయిన కాంచీపురానికి వెళ్తున్నట్లు చెప్పారు.
49
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
69
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
27
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
28
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
24
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
34
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
38
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....