కేరళలోని వయనాడ్లో ప్రకృతి బీభత్సం తర్వాత వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వీరికి దేశంపై ఉన్న ప్రేమ, పనిలో నిబద్ధతను చూసి ఓ చిన్నారి వారికి లేఖ రాశాడు. ఈ లేఖకు ఆర్మీ స్పందించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వయనాడ్కు చెందిన 3వ తరగతి విద్యార్థి భారత ఆర్మీకి లేఖ రాస్తూ ‘ప్రియమైన ఇండియన్ ఆర్మీ.. నా జన్మ స్థలం వయనాడ్లో ప్రకృతి విధ్వంసం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూశా. ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు. బాధితులను కాపాడటానికి వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. నేను ఏదో ఒక రోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తా’ అని రాసుకొచ్చాడు. బాలుడి లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణవల్ల తాము దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొంటూ.. బాలుడి లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
67
You Might Also Like
తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ 3కు విచారణ వాయిదా
71
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా...
ప్రపంచ భారతీయ తత్వవేత్త ఆచార్య సచ్చిదానందమూర్తి : వెంకయ్య నాయుడు
34
భారతీయతత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలతో పాటు... కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి ఆధునిక శాస్త్రాలు కూడా ఉన్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు...
గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసుల చర్యలు
29
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోహత్య కేసుల్లో నిందితులపై పోలీసులు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. తాజాగా పోలీసులు ఉన్నావ్లో గో హంతకునిపై కాల్పులు జరిపారు....
యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం
27
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్నవూ వెళ్తోన్న పుష్పక్ ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ గోవిందపురి స్టేషన్ దగ్గరలో ఆదివారం సాయంత్రం...
తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ
26
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్హౌస్...
కర్కశంగా.. కుక్కేసి! గోవుల ఘోష
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్లో సిద్ధంగా ఉన్న...