News

చారిత్రక స్థలాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి

67views

ఆంధ్రప్రదేశ్‌లోని వారసత్వ కేంద్రాలు, చారిత్రక స్థలాలైన అమరావతి, నాగార్జునకొండ లేపాక్షి, గండికోట, శాలిహుండం, శంకరంలను అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు అన్నారు. గురువారం డిల్లీలో కేంద్ర పరావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌ యదు బీర్‌ సింగ్‌ రావత్‌కు వినతిపత్రం సమర్పించారు అనంతరం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ రాష్ట్రం లోని చారిత్రక స్థలాలును పరిరక్షించి లేపాక్షి, గండికోట, శాలిహుండం, శంకరం వంటి ప్రదేశాలలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పించాలన్నారు. పర్యాటకులను అధికంగా సందర్శించే ఈ ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్నారు.