
306views
సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్తో పాటు నిపుణులైన వెల్డింగ్ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు. ఆయన చెప్పినట్లే ఉత్సవ కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్ గణపతి రూపాన్ని నిర్ణయించారు.




