News

వైభవంగా మల్లన్నకువెండి రథోత్సవం

599views

శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ, మల్లికార్జునస్వామివార్లకు సోమవారం వెండి రథోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్లను ముస్తాబు చేసి రథంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తుల శివనామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణంలో వెండి రథోత్సవం వైభవంగా జరిగిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. అంతకు ముందు స్వామిఅమ్మవార్లకు సహస్ర దీపాలంకరణసేవ నిర్వహించినట్లు చెప్పారు. పూజల్లో ఈవో దంపతులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ కంపార్ట్‌మెంట్లు, సత్రాలు నిండిపోయాయి. సర్వదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. రూ.500 టికెట్లు పొందిన భక్తులు స్పర్శ దర్శనం చేసుకున్నారు.