News

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

78views

ఆంధ్ర ప్రదేశ్ లో 175 శాసన సభా స్థానాలు, 25 లోక్ సభ స్థానాలలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్లను లెక్కిస్తారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు , హోం ఓటింగ్ కు సంబంధించిన ఓట్లు, సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. 8 గంటల 30 నిమిషాల వరకు పోస్టల్ బ్యాకెట్ ఓట్లు, హోం ఓట్లు, సర్వీసు ఓట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును చేపడతారు. ఒక వేళ పోస్టల్ బ్యాలెట్, తదితర ఓట్ల లెక్కింపు ఆ సమయంలోగా పూర్తి కాని పక్షంలో వాటి లెక్కింపును కొనసాగిస్తూనే EVM ఓట్ల లెక్కింపును చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేశారు. సి సి కెమెరాల పర్వక్షణలో లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి పోస్టల్ బ్యాలెట్ లు అధిక సంఖ్యలో 4 లక్షల 61 వేలు పోలయ్యాయి.