కళలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, దానిని కళాకారులు నాటికల ప్రదర్శన ద్వారా నేటి తరాలవారికి అందిస్తున్నారని, కళా పరిషత్లను అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ ఎన్టీఆర్ ట్రస్టీ డాక్టర్ పీ కృష్ణయ్య అన్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో శ్రీకారం రోటరీ కళా పరిషత్ ఆధ్వర్యంలో ప్రారంభించిన 14వ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలకు కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మార్టూరు లో రోటరీ కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను కళల రూపంలో సమాజంలో కళా కారులు ప్రదర్శించడం ద్వారా ప్రజలతో పాటు, ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయన్నారు. సభా కార్యక్రమానికి ముందు ఈ పోటీలను రోటరీ గవర్నర్ డాక్టరు బూసి రెడ్డి శంకరరెడ్డి నటరాజ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం రొటేరియన్లు జీవీ సేతురామన్, వసంత సేతు రామన్ లకు రోటరీ కళా పరిషత్ వారు ముఖ్య అతిది కృష్ణ య్య చేతుల మీదగా సన్మానించారు.
66
You Might Also Like
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
2
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది....
‘దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలి’
11
హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు. విశ్వహిందూ పరిషత్ అన్ని ధార్మిక వ్యాపార, కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన...
కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం
7
కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగుశాసనం బయటపడింది. శివపార్వతులు, స్కంధ విగ్రహాల పీఠంపై ఈ శాసనం లిఖించి ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదని...
సోమనాథ్ మందిరం దగ్గర అక్రమ మసీదు, దర్గా, శ్మశానం తొలగింపు
12
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28న ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు చేయకూడదంటూ ఇటీవల...
ఆర్ఎస్ఎస్ సాంఘిక్ను అడ్డుకోడానికి కేరళ పోలీసుల ప్రయత్నం
140
కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా...
దేవుళ్ళను రాజకీయం చేయకండి: లడ్డూ వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్య
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ,...