భారతీయ సంస్కృతిలో జీవన విలువలున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు డాక్టర్ వారణాసి రామ్మాధవ్ అన్నారు.కాకినాడలోని స్థానిక సూర్యకళా మందిరంలో న్యూ ఢిల్లీకి చెందిన కొచ్చర్లకోట రామరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత వాగ్గేయ కారుడు కొచ్చర్లకోట రామరాజు 148వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంగీత వాగ్గేయ కారుడు రామరాజు తన కళను ధన సంపాదన కోసం కాకుండా కీర్తి సంపాదించేందుకు ఉపయోగించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి ధార్మిక భావంతో ఉన్నప్పుడే కళలు విశ్వవ్యాప్త మవుతాయన్నారు. క్రీ.స్తుశకం 6వ శతాబ్దం వరకు ఎటువంటి కుల వివాదాలు లేవని, విదేశీయుల దండయాత్రలతో కులో న్మాధం ప్రజ్వరిల్లిందని ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరిస్తున్నాయన్నారు.సంగీతం మనుకు ప్రశాంతత ఇస్తుం దన్నారు. ఉగ్రరూపంలో ఉండే దేవతలు సైతం సంగీత కళ వాయిద్యాల ద్వారా ప్రశాంత రూపంలో భక్తులను దర్శనం ఇస్తున్నారన్నారు.
246views
You Might Also Like
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?
29
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు....
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించింది
43
భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక...
తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం
33
తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్...
‘దురంధర్’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ
39
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో...
వాషింగ్టన్లో ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ ఏర్పాటుకు ప్రణాళిక
36
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత దేశ 11 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఒక శాశ్వత మ్యూజియం కొలువుదీరనుంది. సుమారు...
ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు
43
మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్...





