News

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం విశ్వంలోనే లేదు : అమెరికా ప్రశంసలు

102views

భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. భారత్‌ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని అభివర్ణించింది. భారత్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో సువ్యవస్థితంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ విధానం అత్యంత ప్రత్యేకమైందని వైట్‌ హౌజ్‌ పేర్కొంది. భారత్‌ కంటే శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేనేలేదని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కమ్యూనికేషన్‌ అడ్వైజర్‌ జాన్‌ కిర్బీ ప్రకటించారు. ఓటర్లు ఇంత భారీ స్థాయిలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అద్భుతమని అన్నారు. భారత్‌లో చాలా మంది ఓటర్లకు ఓటు విలువ బాగా తెలుసని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ముఖ్యమైన కోణమని విశ్లేషించారు. ఇంత ఓటరు చైతన్యం బహుశ: ఏ ఇతర దేశంలోనూ కనిపించదని కిర్బీ ప్రశంసలు కురిపించారు.