శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 – 5 నిమిషాలు సాక్షాత్కరించింది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్ఈడీ తెరలపై చూసి ఆలయ ఆవరణలోని అసంఖ్యాక భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా పైపులు, కటకాలు, అద్దాలతో దీనికోసం శాస్త్రవేత్తలు ఒక వ్యవస్థను రూపొందించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ సూర్యతిలకం ప్రసరించేలా గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేస్తారు. నల్బాడీ (అస్సాం) ఎన్నికల ర్యాలీ అనంతరం గగనతలంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి నుదుటిపై ‘సూర్య’తిలకం ఏర్పడిన అపురూప ఘట్టాన్ని తన ట్యాబ్లో ప్రధాని వీక్షించారు. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు.
33
You Might Also Like
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విదేశీ బహుళ జాతి కంపెనీలు
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు పెద్దలు. మంచి ఆహారాన్ని తీసుకోవడం అనేది ఒక మంచి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ వంటకాలలో...
ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు
54
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు....
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
41
టీటీడీ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులపై నమోదు చేసిన కేసు విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ...
టీటీడీ రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ అంగీకారం
118
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా...
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
33
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్...
మానవాళికి అమూల్య కానుక రామాయణం
రామాయణంలో వాల్మీకి మహర్షి తన దివ్య ప్రతిభతో మానవత్వ వికాసం పరాకాష్టను అందుకొన్న ఒక భవ్య చిత్రాన్ని తీర్చిదిద్దారు. విశ్వసాహిత్యంలో నిరుపమానమై, విలక్షణమైన స్వర్గసృష్టి అది. భారతీయులు...