
200views
భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ఇంఫాల్ (INS Imphal)’ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వ నిబద్ధత, రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరుగుతున్న వేళ.. మన దేశ రక్షణ సామర్థ్యానికి ఈ యుద్ధనౌక మరింత పదును పెట్టనుంది.





