197
ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన అకుంఠిత దీక్షా తత్పరుడు, ఆంధ్రులకు ఆరాధ్య దైవం, పట్టువదలని విక్రమార్కుడు, సాంఘిక సంస్కరణలకై అహరహము తపించిన ఆదర్శమూర్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు.డిసెంబర్ 15 న శ్రీ పొట్టి శ్రీరాములు తుది శ్వాస విడిచారు. శ్రీ పొట్టి శ్రీరాములు అఖిల ఆంధ్రుల హృదయాలలో అమర జీవిగా నిలచిపోయారు. ఆ విధంగా ఆ అమర జ్యోతి ఆగిపోయినా వారందించిన పోరాట స్ఫూర్తితో తెలుగు జాతి యావత్ ప్రపంచానికి వెలుగులు పంచుతూ ముందుకు సాగుతోంది.