98
జాబిల్లిపై పరిశోధనలకు సంబంధించి తమ ఆసక్తి ఎంతమాత్రమూ తగ్గలేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. వచ్చే నాలుగేళ్లలో చందమామ ఉపరితలం నుంచి శిలలను తీసుకురావడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి భవన్ విమర్శ్ శృంఖలా’లో భాగంగా రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం (ఆర్బీసీసీ)లో ఆయన గురువారం ప్రసంగించారు. జాబిల్లి పైనుంచి శిలలను తీసుకొచ్చే ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా స్వతంత్రంగా జరగాలని పేర్కొన్నారు.