News

350 ఏళ్ల తర్వాత దేశానికి శివాజీ వాడిన ‘వాఘ్ నఖ్’

381views

ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో బీజాపూర్ సుల్తానేట్ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి ఉపయోగించిన ప్రసిద్ద ‘వాఘ్ నఖ్'(పులి గోళ్లు) అనే ఇనుప ఆయుధాన్ని నవంబర్‌లో బ్రిటన్ నుంచి భారతదేశానికి తిరిగి తీసుకువస్తామని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.

17వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధ రాజు ప్రసిద్ధ ‘జగదాంబ’ ఖడ్గాన్ని లండన్ మ్యూజియం నుంచి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

“మొదటి దశలో మేము వాఘ్ నఖ్‌ను తీసుకువస్తున్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్‌ను అంతం చేసిన రోజున దానిని తీసుకురావడమే మా ప్రయత్నం,” అని మంత్రి తెలిపారు.

“అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్‌ను వెనుక భాగంలో పొడిచినప్పుడు (సమావేశంలో), అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ మహారాజ్ ‘వాఘ్ నఖ్’ను ఉపయోగించాడు” అని మంత్రి అన్నారు. “వాఘ్ నఖ్ ప్రేరణ, శక్తి మూలం. ఈ సంవత్సరం కూడా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తవుతాయి” అని ఆయన అన్నారు.న’జగదాంబ’ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన ఉత్సవ ఖడ్గం. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థుడైన శివాజీ IV, వజ్రాలు. కెంపులతో అమర్చబడిన ‘జగదాంబ’ ఖడ్గాన్ని అప్పటి వేల్స్ యువరాజుగా ఉన్న ఆల్బర్ట్ ఎడ్వర్డ్‌కు బహుకరించాడు.

అఫ్జల్ ఖాన్ శక్తివంతమైన సైన్యాన్ని గెరిల్లా యుద్ధం ఉపయోగించి మరాఠాలు ఓడించారు. 1659లో ‘వాఘ్ నఖ్’ అనే పదునైన ఇనుప ఆయుధంతో పులి గోళ్ల ఆకారంలో శివాజీ.. ఖాన్‌ను చంపాడు. ప్రస్తుత సతారా జిల్లాలోని ప్రతాప్‌గడ్ కోట పాదాల వద్ద ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఇది జరిగింది.తిరిగి తీసుకొచ్చిన తర్వాత, ఆయుధాన్ని దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ సంగ్రహాలయ (మ్యూజియం)లో ఉంచే అవకాశం ఉంది.