News

శివరాత్రి సందర్బంగా కృష్ణానది రేవు సమీపంలో స్నాన ఘట్టాలు ఏర్పాటు

257views

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మద్దూరు ఎన్టీఆర్‌ పుష్కర్‌ ఘాట్‌లో పటిష్ట ఏర్పాట్లు చేపడతు న్నామని కంకిపాడు ఎస్సై జె. లక్ష్మీ అన్నారు. మద్దూరు ఎన్టీఆర్‌ పుష్కర్‌ఘాట్‌, కాసరనేనివారిపాలెంలోని నదీ పరివాహక ప్రాంతాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై జె. లక్ష్మీ మాట్లాడుతూ శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని పున్యస్నానాన్ని ఆచ రిస్తుంటారని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఈ కార్య క్ర మంలో ఈవో చింతా కిరణ్‌ కుమార్‌, ఫిషరి డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పూజిత, సర్పంచ్‌ చిప్పల దాసు, ఎంపీటీసీ వడుగు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పెదపులిపాకలో..
పెనమలూరు : మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పెద్దపులిపాక గ్రామ సర్పంచి గుంటూరు శ్రీనివాసచౌదరి బుధవారం తెలిపారు. పెదపులిపాక గ్రామ సమీపంలోని కృష్ణానది రేవు సమీపంలో స్నాన ఘట్టాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలు, వృద్ధుల సౌకర్యార్థం మోటారు సౌకార్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.