యాంటీ టెర్రర్ ప్లాట్ఫామ్ నుంచి పాక్ తొలగింపుపై భారత్ స్పందన…. ముంబై దోషులపై కఠిన చర్యలు తీసుకోండి

పారిస్: ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన ‘గ్రే లిస్ట్’ నుంచి పాకిస్థాన్ను తొలగించింది. పారిస్లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్ అధ్యక్షుడు రాజ కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే నాలుగేళ్ళ తర్వాత పాక్కు దక్కిన ఊరట పరిణామంపై భారత్ స్పందించింది. మనీల్యాండరింగ్ అంశంలో ఆసియా ఫసిఫిక్ గ్రూప్నకు పాక్ సహకారం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. అంతేకాదు.. ఫాట్ఫ్ పరిశీలన ఫలితంతో.. 26/11 ముంబై దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులతో పాటు మరికొందరిపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా.. పాక్ తన ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉగ్రవాదం, ఉగ్రవాద ఆర్థిక కార్యాకలాపాలకు వ్యతిరేకరంగా నమ్మకమైన, నిరంతర చర్యలను కొనసాగించాలని.. ఈ విషయాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేయాలని ఆయన ప్రకటనలో కోరారు.





