
619views
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారి కోల్కతా నగరంలోని హుగ్లీ నది అడుగున మెట్రోరైలు మార్గం కోసం సొరంగం నిర్మాణం చేపట్టారు. హౌరా- కోల్కతా నగరాల మధ్య మెట్రో కనెక్టివిటీని నెలకొల్పడానికి హుగ్లీ నది కింద నీటి అడుగున సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ సొరంగం నిర్మాణం 2023 నాటికి పూర్తి కానుంది. తూర్పు-పశ్చిమ ప్రాంతంలో 16.6 కిలోమీటర్ల పొడవులో, 520 మీటర్ల నదీ గర్భం కింద ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.





