News

జమ్మూక‌శ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు

442views

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని లడ్డీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హరిపోరా ట్రెంజ్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భారత సైన్యం, పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

ఈ ఎదురు కాల్పుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు. ఇటీవల దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని ఛోటోగామ్ ప్రాంతంలో కశ్మీరీ పండిట్ దుకాణదారుడిపై ఇద్దరు మోటారుసైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి