News

సింహాచలం దేవస్థానం భూ అక్రమాలపై ప్రభుత్వ చర్యలు.. ఇద్దరు ఉన్నతాధికారుల సస్పెన్షన్

457views

సింహాచలం భూముల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేవాదాయశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతను సస్పెండ్‌ చేస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ ఆస్తుల రిజిస్టర్ నుంచి భూముల తొలగింపులో.. ఏసీ రామచంద్రమోహన్‌, ఏఈవో సుజాతలు గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాన్సాస్ భూముల అమ్మకాల్లో రూ.74 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ కమిటీ నివేదిక అందించింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

సింహాచలం దేవస్థానం, మాన్సస్ ట్రస్ట్ ఈవోగా పనిచేసిన సమయంలో రామచంద్రమోహన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయ భూ రికార్డుల తారుమారులో సింహాచలం దేవస్థానం డిప్యూటీ ఈవో సుజాత ప్రమేయం ఉన్నట్లుగా కమిటీ నిర్ధారించడంతో.. ఆమెను సైతం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.