News

News

హిందూ చైతన్య ఐక్యవేదిక బైక్‌ ర్యాలీ

హనుమాన జయంతి సందర్భంగా మదనపల్లెలోని స్థానిక సొసైటీ కాలనీలోని రామాలయం నుంచి హిందూ చైతన్య వేదిక హనుమాన శోభయాత్రలో భాగంగా భారీగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. హిందూత్వం పెంపొందడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వ హిస్తున్నట్లు హిందూ చైతన్య వేదిక ప్రాంత సంయోజన అధ్యక్షుడు పిన్నం వెంగళరావు తెలిపారు. పట్టణంలో రామాలయం వద్ద ప్రా రంభమైన ర్యాలీ ఎన్టీఆర్‌ సర్కిల్‌, కదిరిరోడ్డు, నీరుగట్టువారిపల్లె, ఆర్టీసీ బస్టాండ్‌, సీటీఎం రో డ్డు, బెంగళూరు బస్టాండ్‌ మీదుగా తిరిగి ఎస్టీఆర్‌ సర్కిల్‌, రామాలయం వరకు సాగింది....
News

ఓ రాజ్య పరిపాలకురాలిగా ఆదర్శ మూర్తి రాణి అహల్యా బాయి : మోహన్ భాగవత్

హిందూ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయించిన రాజమాత దేవీ అహల్యబాయి హోల్కర్‌. అనేక సత్రాలు కట్టించారు. కాశీ ఆలయం, కేదారనాథ్‌, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథాలయం… ఇలా అనేక ధర్మ కార్యాలు చేశారు. ఆవిడ మంచి పరిపాలనాదక్షురాలు. ప్రతి రోజూ...
ArticlesNews

సర్వలక్షణ శోభితుడు ‘సుందర’ నాయకుడు

(జూన్ 1 - హనుమత్జయంతి ) శ్రీమద్రామాయణం విచిత్ర మణిహారం. అందులోని పాత్రలన్నీ అనర్ఘరత్నాలే. ఈ మహా కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు హనుమే. ఈ కావ్యానికి తలమానికంగా భావించే ‘సుందరకాండ’లో ఆయన పరాక్రమం, కార్యదీక్ష,...
News

నారసింహుడి వసంతోత్సవం

అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గురువారం వసంతోత్సవం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, ఉత్సవ నిత్యహోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఉద్భవ లక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో అర్చకులు గుండూరావు, బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు చక్రస్నానం చేయించారు. అనంతరం అర్చకులు ఒకరిపై ఒకరు వసంతాలను చల్లుకున్నారు. సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహించారు. కార్యక్రమానికి రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆమిద్యాలకు చెందిన సుగుణపతి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈవో విజయ్‌ కుమార్‌ పర్యవేక్షించారు....
News

బెంగాల్, హర్యానా , ఉత్తరాఖండ్ లో పౌరసత్వ సర్టిఫికేట్ల జారీ

నూతన పౌరసత్వ సవరణ చట్టంలో (సీఏఏ) భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురు పౌరులకి పౌరసత్వ సర్టిఫికేట్లను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సర్టిఫికేట్లను అందజేశారు.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది. తమ రాష్ట్రంలో ససేఏఏను అమలు చేయనీయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. అమలు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ష పేర్కొంటూ వచ్చారు. మరోవైపు మొదటి విడత పౌరసత్వ సర్టిఫికేట్లను ఈ నెల 15న అందజేససన విషయం తెలిసందే. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా 14 మందికి అందజేశారు....
News

ఆ వివాహం చెల్లదు.. మతాంతర వివాహాలపై హైకోర్టు సంచలన తీర్పు

మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతాంతర వివాహం రిజిస్టర్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లద్దని జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియతో కూడిన ధర్మాసనం స్పష్టం...
ArticlesNews

2024 మే 31 నుంచి 2025 మే 31 దాకా అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు

దేశమంతా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది మే 31 దాకా అహల్యాబాయి త్రిశత జయంతి ఉత్సవాలు జరుపుకుంటోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ తెలివి, మేధస్సు, ధైర్యసాహసాలతో ఆమె మహారాణిగా ఎదిగారు. సువిశాల భూభాగంలో పరిపాలన చేసి ఎన్నెన్నో సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు, బాలిక విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఆమె. హిందూ ఆలయాల పునరుజ్జీవనం కోసం.. తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తే, గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణరంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత ఆమె. ఆమె హిందూధర్మ పునరుజ్జీవనానికి ఎంతగానో కృషి చేశారు. విదేశీ పాలకుల వల్ల దేశ వ్యాప్తంగా ధ్వంసం అయిన 82 మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, కాశీ, గయ, పూరి, శ్రీశైలం... ఇలా అనేక మందిరాలను...
ArticlesNews

అపర శంకరులు ఆ పరమాచార్యులు

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు. మన పతాకానికి మహాస్వామి నిర్వచనం: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చంద్రశేఖరేంద్ర స్వామి కంచిపీఠంలో ప్రసంగిస్తూ ‘మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. కాషాయరంగు సౌభాగ్యాలనిచ్చే మహాలక్ష్మిది. తెలుపు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిది. ముదురుపచ్చ మనల్ని రక్షించే పరాశక్తి రూపమైన దుర్గాదేవిది. దేవీశక్తుల ప్రతీకలే మూడు చారలుగా కనబడటం విశేషం. అపార ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి కావలసిన శక్తిని ప్రసాదించాల్సిందిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. సముపార్జించుకున్న...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన అమిత్ షా దంపతులు.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అమిత్ షా దంపతులకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు...
News

అమర్ నాథ్ యాత్రకు హెలికాఫ్టర్ సేవలకు బుకింగ్ ప్రారంభం

అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ సేవలు జూన్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకోవచ్చని యాత్రికులకు జమ్ము కశ్మీర్ అధికార వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే ఈ హెలికాఫ్టర్ సర్వీస్ రేట్లను...
1 1,193 1,194 1,195 1,196 1,197 2,480
Page 1195 of 2480