News

నమాజ్ నేర్చుకోడానికి వచ్చారనడం ఒక కట్టుకథ : విశ్వహిందూ పరిషత్

1kviews

100 శాతం ఇస్లామిక్ దేశం అయిన ఇండోనేషియా నుండి నమాజు నేర్చుకోడానికి కరీంనగర్ వచ్చారని చెప్పడం వట్టి కట్టుకథ అని.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన CAA చట్టానికి వ్యతిరేకంగా దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” (PFI) కరీంనగర్ నిర్వాహకుడు జమీల్ వద్దే ఇండోనేషియన్లు ఆశ్రయం పొందటం వెనుక ఉన్న ఉద్దేశ్యం ?

మరియు వచ్చిన వారు ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటించడం వెనక గల కారణం, వారికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా తేలడం వెనక ఉన్న రహస్యాలపై మరియు ఇటీవల రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనే, మయన్మార్, ఇరాన్ మరియు ఇతర దేశాల నుండి వచ్చిన విదేశీయుల కదలికలపై పూర్తి నిఘాపెట్టి అన్ని కోణాలలో “National Investigation Agency” (NIA) చే సమగ్ర దర్యాప్తు జరిపించాలని

“విశ్వహిందూ పరిషత్” (VHP) అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Source : Telangana Mata

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.