
525views
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్ బయటపడింది. కశ్మీరీలకు పాకిస్థాన్లో శిక్షణ ఇచ్చి ఉగ్రవాదం వైపు మళ్లించామని ఆ ఇంటర్వ్యూలో ముషారఫ్ చెప్పారు. ఒసామా బిన్ లాడెన్, జవహిరీ, జలాలుద్దీన్ హక్కానీ పాకిస్థాన్ హీరోలు అని ముషారఫ్ పేర్కొన్నారు. అయితే ఆ వీడియో క్లిఫ్ను పాకిస్థాన్ రాజకీయ నాయకులు ఫర్హాతుల్లా బాబర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియదు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





