విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ ఎం.పి కేశినేని శివనాధ్, పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి తెలిపారు . ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవములు -2024 పోస్టర్ మరియు ఆహ్వానం పత్రికను ఆవిష్కరించారు .ఈ సందర్బంగా వారు మీడియా తో మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అక్టోబరు 3వ తేదీన బాలా త్రిపుర సుందరీ దేవి, 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణాదేవి, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీ, 8న మహాలక్ష్మి, 9న సరస్వతీ దేవి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్ధని, 12న రాజరాజేశ్వరిదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారని చెప్పారు. 9వ తేదీన మూలా నక్షత్రం రోజు సరస్వతీ దేవి అలంకారం సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని. దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా అన్ని రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
24
You Might Also Like
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
17
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
16
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...
తిరుమల లడ్డూ వివాదం… అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ
19
కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం...
పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు
19
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు...
మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.....