భారతీయ నాట్య వైభవానికి తలమానికమైన భరతనాట్యంలో ‘అరంగేట్రం’ చేయడం ద్వారా చైనాకు చెందిన 13 ఏళ్ల లీ ముజి అనే విద్యార్థిని చరిత్ర సృష్టించింది. ఈ మేరకు బీజింగ్ లో వారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ భరత నాట్య కళాకారిణి లీలా శాంసన్, భారత దౌత్యవేత్తలు, పెద్ద ఎత్తున హాజరైన స్థానికుల ఎదుట లీ భరతనాట్యంలో అరం గేట్ర ప్రదర్శన చేసింది. తద్వారా పూర్తిగా చైనాలోనే శిక్షణ పొంది, ఇక్కడే అరంగేట్రం చేసిన తొలి నర్తకిగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల లీ ముజి భరతనాట్యంలో పదేళ్లుగా శిక్షణ తీసుకుంటోంది. 1999లో ఢిల్లీలో అరం గేట్రం చేసిన జిన్ షాన్ షాన్ అనే కళాకారిణి లీకి గురువుగా వ్యవహరించారు. ‘నేను ఈ నాట్యంతో ఎప్పుడో ప్రేమలో పడి పోయా. భరతనాట్యం కేవలం ఒక అంద మైన కళ మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి ఒక ప్రతిరూపం” అని లీ ముజి అభివ ర్ణించింది. చెన్నైలో ఈ నెలాఖరులో లీ నాట్య ప్రదర్శన జరగనుంది.
47
You Might Also Like
మన ధర్మాన్ని మనమే కించపరుస్తున్నాం : ధీరేంద్ర కృష్ణశాస్త్రి
బాగేశ్వర్ ధామ్ కి చెందిన పండిత ధీరేంద్ర కృష్ణశాస్త్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. హిందువులందరూ తమ మతం,...
భారత్ కు 297 పురాతన కళాఖండాల అప్పగింత
2
పురాతన భారతీయుల కళా వైభవం చెప్పడానికి మాటలు చాలవు. ప్రధానంగా శిల్పకళలో వారి విద్యకు సాటి లేదు. కానీ విదేశీయుల పాలనలో వేలాది కళాఖండాలు సరిహద్దులు దాటిపోయాయి....
గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ
20
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి...
తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
11
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక...
దుర్గా మండపంలో గోవు తల: ఛాందసుల పనేనన్న హిందువులు
29
హిందువులకు దేవీ నవరాత్రులు అత్యంత పవిత్రం. అత్యంత నిష్ఠతో మాంసం, మద్యానికి దూరంగా వుండి అమ్మవారిని కొలుస్తారు. కానీ... బెంగాల్ లో ఘోరం జరిగింది. బెహార్ జిల్లాలోని...