ఉత్తర్ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురకు చెందిన కృష్ణ జన్మ భూమి – షాహీ ఈద్గా వివాదంపై హిందూ కక్షిదారులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషను దాఖలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి హిందూపక్షం వేసిన 18 పిటిషన్ల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు వాటికి విచారణార్హత ఉందంటూ ఆగస్టు 1న స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ముస్లిం సమాజం సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున హిందూ వర్గీయులు ముందస్తుగా కేవియట్ దాఖలు చేశారు. న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ద్వారా వేసిన ఈ పిటిషనులో తగిన విచారణ లేకుండా తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఏకపక్ష ఆదేశాలు జారీ చేయవద్దని హిందూపక్షం కోర్టును కోరింది. మధురలో ప్రస్తుతం ఈద్గా ఉన్నచోట గతంలో మందిరం ఉండేదని, ఔరంగజేబు హయాంలో మందిరాన్ని పడగొట్టి ఈద్గా మసీదు కట్టారని హిందూ వర్గం వాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 12న జరగనుంది.
42
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
43
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
39
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
53
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...