News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

57views

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్టీసీ డిపో నుంచి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి, తమిళ నాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ వేణు తెలిపారు. ఆగస్టు 2న రాత్రి 10 గంటలకు బయల్దేరే వాడపల్లి ప్రత్యేక బస్సు సర్వీసు వీఎం బంజరు, సత్తు పల్లి, జంగారెడ్డిగూడెం మీదుగా తెల్లవారు జామున 3 గంటలకు వాడపల్లి చేరుతుందని తెలిపారు. ఆన్లైన్లో ఈ బస్సుకు ముం దస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, ఒక్కొక్కరికీ రానుపోను చార్జీ రూ.350గా నిర్ణయించి నట్లు తెలిపారు. తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఆగస్టు 17 సాయంత్రం 5 గంటలకు బయల్దేరి 18వ తేదీ రాత్రి అరుణాచలం చేరుతుందని తెలి పారు. 19వ తేదీ రాత్రి అరుణాచలంలో బయల్దేరి 20వ తేదీ రాత్రి తిరువూరు చేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ముందుగా సీట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9885661835లో సంప్రదించాలని సూచించారు.