పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, వినాయక చవితి, విజయదశమి ఉత్సవాలకు మట్టి విగ్రహాలే వినియోగించి నిమజ్జనం చేసేలా అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో జరిగే వినాయకచవితి, అక్టోబర్లో జరిగే విజయదశమి ఉత్సవాల నిర్వహణకు మట్టితో చేసిన ఉత్సవ విగ్రహాలను వినియోగించేలా చూడాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు.. ముందస్తుగా విగ్రహ తయారీదారులకు హెచ్చరిక జారీ చేస్తూ.. పివోపీ స్థానంలో పర్యావరణ సహిత మట్టిబొమ్మలు తయారుచేయాలని సూచించాలన్నారు. పాఠశాలలు, జనావాస ప్రాతాల్లో పోస్టర్లు, కరపత్రాల రూపంలోనూ, మీడియా ద్వారా మట్టి విగ్రహాల వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ధిక్కార చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సమన్వయంతో పనిచేసి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్క అధికారి భాగస్వామ్యం కావాలన్నారు.అనంతరం మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రచురించిన గోడ పత్రాలు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.
54
You Might Also Like
13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
25
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి...
పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
15
పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు...
సర్జికల్ స్ట్రైక్: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016,...
తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…
20
శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది....
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
26
రాజస్థాన్లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత...
సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..
24
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా బంగారు...